Thursday, April 18, 2024

ఈ నెల 25న టీఆర్ఎస్ అధ్యక్షుడి ఎన్నిక

అక్టోబర్ 17న టీఆర్ఎస్ అధ్యక్షుడి ఎన్నికకు షెడ్యూల్ విడుదల కానుంది. ఈ మేరకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఇప్పటినుంచి రెండేళ్లకోసారి పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకుంటామని ప్రకటించారు. అక్టోబర్​ 17న ఈ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికల కోసం షెడ్యూల్​ విడుదలవుతుందన్నారు. అక్టోబర్ 17 నుంచి 22 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని.. 23న నామినేషన్ల పరిశీలన ఉంటుందని చెప్పారు. అక్టోబర్‌ 24న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందన్నారు. అక్టోబర్‌ 25న టీఆర్ఎస్ అధ్యక్షుడి ఎన్నికతో పాటు సర్వసభ్య సమావేశం, ప్లీనరీ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. ఈనెల 17న పార్టీ అసెంబ్లీ, పార్లమెంటరీ సభ్యుల సమావేశం నిర్వహించనున్నామని తెలిపారు. పార్టీకి సంబంధించిన తీర్మానాల కమిటీ ఛైర్మన్​గా మాజీ స్పీకర్​ సిరికొండ మధుసూదనా చారి వ్యవహరించనున్నారని తెలిపారు. అక్టోబర్​ 27న రాష్ట్రవ్యాప్తంగా పార్టీ నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశాలు నిర్వహించనున్నామని పేర్కొన్నారు. అక్టోబర్​ 25న రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక కోసం పార్టీ జనరల్​ బాడీ మీటింగ్​ను హైదరాబాద్​లో నిర్వహించబోతున్నట్లు కేటీఆర్ తెలిపారు.

ఇది కూడా చదవండి: హుజురాబాద్ కు అమిత్ షా ?.. కేసీఆర్ సభకు చెక్!

Advertisement

తాజా వార్తలు

Advertisement