Friday, April 26, 2024

మాదాపూర్ హైటెక్స్ లో టీఆర్ఎస్ ప్లీనరీ.. ఘనంగా ఏర్పాట్లు

TRS పార్టీ ద్వి దశాబ్ది వేడుకల్లో భాగంగా 25వ తేదీన‌ పార్టీ అధ్య‌క్షుడి ఎన్నిక జ‌ర‌గ‌నుంది. దీని కోసం నిర్వహించే ప్లీనరీ ఏర్పాట్లను ఆహ్వాన కమిటీ సభ్యులు మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అరికేపూడి గాంధీ మంగళవారం సమీక్ష నిర్వహించారు. మాదాపూర్ హైటెక్స్లో జ‌రుగుతున్న ఏర్పాట్ల‌ను ప‌రిశీలించారు. స‌కాలంలో అన్ని ప‌నులు పూర్తి చేయాల‌ని ఆదేశించారు. తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌ను కూడా వివ‌రించారు.

ప్లీనరీకి వచ్చే ప్రజా ప్రతినిధులు, నాయకులకు ఎటువంటి ఇబ్బందీ కలగకుండా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. నిర్ణీత కాలానికి ముందే ఏర్పాట్లన్నీ పూర్తి కావాలని సంబంధిత ఇన్‌చార్జీల‌కు సూచించారు. అలాగే అధికారులు, పోలీస్ పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వారికి పలు సూచనలు చేశారు.

ఈ సమీక్షలో ఎమ్మెల్సీ కుర్మయ్యగారి నవీన్ కుమార్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్,కార్పొరేటర్లు జగదీశ్వర్ గౌడ్, రోజా రంగారావు ట్రాఫిక్ డీసీపీ విజయ్ కుమార్, GHMC అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement