Friday, April 19, 2024

నేడు టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ, కార్యవర్గ సమావేశం

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఈరోజు టీఆర్ఎస్ లెజిస్లేటివ్, పార్లమెంటరీ పార్టీ, కార్యవర్గ సమావేశం నిర్వ‌హించ‌నున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో ఈ సమావేశం జ‌ర‌గ‌నుంది. ఈ సమావేశానికి టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు పార్టీ రాష్ట్ర కార్యవర్గం హాజరుకానుంది. బీఆర్ఎస్ కు ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చిన నేపథ్యంలో జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడంపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు.

ఓ వైపు రాష్ట్రం, మరోవైపు దేశంలో భారత రాష్ట్ర సమితి జెండా ఎగురవేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసే అంశాలపై నేతలకు సూచనలు చేయనున్నారు. మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపు కోసం పనిచేసిన ప్రతి ఒక్కరినీ కేసీఆర్ అభినందించనున్నారని తెలుస్తోంది. అదేవిధంగా పార్టీ బలోపేతంపై గులాబీ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేసే అవకాశముంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement