Monday, March 25, 2024

Covd-19: టీఆర్‌ఎస్‌ ఎంపీ రంజిత్‌ రెడ్డికి కరోనా

టీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కరోనా పాజిటివ్ రావడంతో ఆయన ఐసోలేషన్ లో వైద్యం తీసుకుంటున్నారు. గత వారం రోజులుగా తనను కలిసిన వాళ్ళు పరీక్ష చేయించుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు టిఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి. తన ఐసోలేషన్ పూర్తయ్యే వరకు ప్రజలు తన వద్దకు రావద్దు అని కోరారు.

‘టీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు, నాయకులకు, కార్యకర్తలకు, అధికారులకు ప్రజలకు నా మనవి. నాకు కోవిడ్ పాజిటివ్ గా నిర్దారణ అయినందున గత కొన్ని రోజులుగా నాతో ప్రైమరీ కాంటాక్ట్ ఉన్న వారు హోమ్ ఐసోలేషన్ తో పాటు అవసరమైతే కోవిడ్ పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను’ అని రంజిత్ రెడ్డి ట్వీట్ చేశారు.

మరోవైపు నిన్న తెలంగాణ రాష్ట్ర మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావుకు క‌రోనా పాజిటివ్ గా నిర్ధార‌ణ అయింది. ప్ర‌స్తుతం ఆయ‌న హోం ఐసోలేష‌న్ లో ఉన్నారు. ఆయ‌న ఆరోగ్యం ప్ర‌స్తుతం నిల‌క‌డ గానే ఉంద‌ని వైద్యులు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement