Wednesday, April 24, 2024

బండి సంజయ్ రాసలీలలు బయటపెడుతాః TRS ఎమ్మెల్యే మైనంపల్లి సవాల్

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ బండారాన్ని త్వరలోనే బయటపెడతానని టీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు. దళితులపై దాడి చేసినట్టు తనపై తప్పుడు కేసులు పెట్టారని, దాడి జరిగిన సమయంలో తాను ఇంట్లోనే లేనని చెప్పారు. తాను ఇంట్లో ఉన్నట్టు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. బండి సంజయ్ ఏఎస్ రావు నగర్ రహస్యాలను బయటపెడతానని… రాసలీలల గుట్టు విప్పుతానని అన్నారు. తనపై ఎన్ని కేసులు పెట్టినా భయపడబోనని స్పష్టం చేశారు. బండి సంజయ్ తో ఎలాంటి చర్చకైనా సిద్ధమని ప్రకటించారు. సంజయ్ ని పదవి నుంచి దింపేంత వరకు నిద్రపోనని మైనంపల్లి చెప్పారు.

కాగా, ఇటీవల మల్కాజ్ గిరిలో జరిగిన కార్యక్రమంలో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఎమ్మెల్యే మైనంపల్లిపై పలు సెక్షన్ ల కింద కేసులు నమోదు అయ్యాయి. ఈ క్రమంలో మైనంపల్లి, బండి సంజయ్ ల మధ్య మాటల యుద్ధం మొదలైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement