Thursday, April 25, 2024

బేగంబజార్ లో టీఆర్ఎస్ లీడర్ విశ్వరూపం

హైదరాబాద్ బేగం బజార్ దళ్ మండిలో టీఆర్ఎస్ నాయకురాలు శాంతి దేవి హల్ చల్ చేశారు. నిన్న రాత్రి 8 గంటలకు షాప్ క్లోజ్ చేయాలంటూ హుకుం జారీ చేశారు. ఓ ప్లై వుడ్ షాప్ మూసివేయకపోవడంతో సదరు షాప్ యాజమానిపై శాంతి దేవి దాడి చేశారు. దీంతో ‘నువ్వు అధికారివా ?నీకేం సంబంధం?’  అంటూ శాంతి దేవిని దుకాణం యజమానులు తిరగబడ్డారు. దీంతో తనను ప్రశ్నించినందుకు శాంతి దేవి తన విశ్వరూపం చూపించారు. షాప్ యజమానులపై దాడికి పాల్పడ్డారు. తన అనుచరులతో కలిసి రెచ్చిపోయారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ లో రికార్డ్ అయ్యాయి. ఈ ఘటనపై బేగం బజార్ పోలీసులకు షాప్ యజమాని పిర్యాదు చేశారు. దీంతో శాంతి దేవి పై 323, 290 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కరోనా నిబంధనలు ఉలంఘించినందుకు మరో కేసు నమోదు చేయనున్నారు. శాంతి దేవి తో పాటు మరో ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement