Thursday, April 18, 2024

ఫస్ట్ డోస్ ఆపేశారు కదా.. మరి మంచు లక్ష్మీకి ఎలా సాధ్యమైంది?

తెలంగాణలో శనివారం నుంచి కరోనా వ్యాక్సిన్ తొలి డోస్‌లను నిలిపివేశారు. వ్యాక్సిన్ కొరత కారణంగా కేవలం రెండో డోస్ తీసుకునేవాళ్లకే టీకాలు వేస్తామని ప్రభుత్వం వెల్లడించింది. కానీ శనివారం నాడు నటి మంచు లక్ష్మీ యశోద ఆస్పత్రిలో కరోనా మొదటి డోస్ తీసుకున్నానని చెప్పడంతో సోషల్ మీడియాలో తెలంగాణ ప్రభుత్వంపై నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. తెలంగాణలో ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ వేయడం ఆపేశారని, కానీ మంచు లక్ష్మీకి ఎలా వేశారని ప్రశ్నిస్తున్నారు. రెండో డోస్ వేసుకునే వాళ్లకే వ్యాక్సిన్ ఇస్తున్నామని చెప్పిన ప్రభుత్వం.. సెలబ్రిటీలను ఒకలా, సామాన్యులను మరొకలా ట్రీట్ చేయడం సరికాదని హితవు పలుకుతున్నారు. సామాన్య ప్రజలవి కూడా ప్రాణాలేనని ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నారు.

https://twitter.com/LakshmiManchu/status/1391013885746958338
Advertisement

తాజా వార్తలు

Advertisement