Thursday, April 25, 2024

Tripura : 48 మందితో బీజేపీ తొలి జాబితా విడుదల

త్రిపుర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఫిబ్ర‌వ‌రి 16న జ‌రుగ‌నుంది. ఈ ఎన్నిక‌ల‌కు సంబంధించి బీజేపీ జాబితా విడుదలైంది. 48 మందితో కూడిన తొలి జాబితాను పార్టీ అధిష్టానం రిలీజ్ చేసింది. ఈ మేరకు టౌన్ బోర్డోవాలి నుంచి సీఎం మాణిక్ సాహా బరిలో నిలువనున్నారని తెలుస్తోంది. అయితే త్రిపుర అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ ఇప్పటికే విడుదల కాగా నామినేషన్లను 30వ తేదీ వరకు స్వీకరించనున్నారు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ 30తో ముగియనుండగా. నామినేషన్ల ఉపసంహారణకు చివరి తేదీ ఫిబ్రవరి 2 అని పేర్కొన్నారు. అదేవిధంగా ఫిబ్రవరి 16న ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ మార్చి 2వ తేదీన నిర్వహించనున్నారు. అయితే ఎన్నిక‌ల ఫ‌లితాలు కూడా అదే రోజునే వెలువ‌డ‌నున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement