Thursday, April 18, 2024

మాస్కులపై కేంద్రం కొత్త మార్గదర్శకాలు

దేశంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్న త‌రుణంలో కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ శాఖ మ‌రో కీల‌క సూచ‌న చేసింది. కరోనా నివార‌ణ‌కు సంబంధించి గురువారం కొత్త మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ చేసింది. హోం ఐసోలేష‌న్‌లో ఉండే క‌రోనా పాజిటివ్ బాధితులు.. త‌ప్ప‌నిస‌రిగా ట్రిపుల్ లేయ‌ర్ మెడిక‌ల్ మాస్కును ధ‌రించాల‌ని ఆదేశించింది. బాధిత వ్య‌క్తి ఇంట్లోని ఓ గ‌దిలో ఒంట‌రిగా ఉండాల‌ని, ఇత‌ర కుటుంబ స‌భ్యుల‌కు దూరంగా ఉండాల‌ని సూచ‌న చేసింది. ఈ జాగ్ర‌త్త‌లు పాటిస్తే క‌రోనా నుంచి విముక్తి పొందవచ్చని తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement