Thursday, April 18, 2024

నౌకాద‌ళ సిబ్బందికి నివాళుల‌ర్పించిన : గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సై

తూర్పునౌకాద‌ళ క‌మాండ్ ని సంద‌ర్శించారు తెలంగాణ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై. విశాఖ నేవ‌ల్ డాక్ యార్డ్ లోని స్మ‌ర‌ణ్ స్థ‌ల్ వ‌ద్ద విధి నిర్వ‌హ‌ణ‌లో త్యాగం చేసిన నౌకాద‌ళ సిబ్బందికి గ‌వ‌ర్న‌ర్ నివాళుల‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా నేవీ అధికారులు ఈఎన్‌సీలో గవర్నర్‌ తమిళిసైకి సాదరస్వాగతం పలికారు. ఈ సందర్భంగా దేశీయంగా రూపొందించిన, నిర్మించిన స్టీల్త్ ఫ్రిగేట్, ఐఎన్‌ఎస్‌ శివాలిక్‌ జలాంతర్గామిని గైడెడ్ టూర్ డాక్టర్ తమిళిసైకి అందించారు. దేశ సముద్ర ప్రయోజనాలను పరిరక్షించడంలో భారత నౌకాదళం పాత్ర, బాధ్యతల గురించి ఈఎన్‌సీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ వైస్ అడ్మిరల్ సంజయ్ వాత్సయన్ గవర్నర్‌కు వివరించారు. చాలా సేపు ఈఎన్‌సీలో గడిపిన తమిళిసై.. అక్కడి విభాగాల్లో కలియదిరిగారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement