Friday, March 29, 2024

Live Update | ఇంకా 382 మందికి ట్రీట్​మెంట్​.. కొంతమంది పరిస్థితి క్రిటికల్​!

ఒడిశాలో నిన్న జరిగిన మూడు రైళ్ల ప్రమాదంలో వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. అందులో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా కొంతమంది చావుబతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. అయితే.. దీనికి సంబంధించి రైల్వే శాఖ ఇవ్వాల రాత్రి ఓ కీలక ప్రకటన చేసింది.

ఇప్పటివరకు 1175 మంది పలు ప్రైవేటు హాస్పిటళ్లలో చికిత్స పొందుతున్నారని, ఇందులో 793 మంది చికిత్స పొంది సురక్షితంగా డిశ్చార్జి అయినట్టు రైల్వే శాఖ తెలిపింది. కాగా, మరో 382 మంది ఇంకా పలు హాస్పిటళ్లలో చికిత్స కొనసాగుతుందని, వీరిలో మరో ఇద్దరి పరిస్థితి క్రిటికల్​గా ఉన్నట్టు ఆస్పత్రి వర్గాల ద్వారా తెలిసింది. ఈ వివరాలతో రైల్వేశాఖ కొద్దిసేపటి క్రితం ట్వీట్​ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement