Saturday, April 20, 2024

ప‌ట్టాలు త‌ప్పిన రైలు – ముగ్గురు మృతి – 20మందికి తీవ్ర గాయాలు

గువాహ‌టీ-బిక‌నేర్ ఎక్స్ ప్రెస్ ప్ర‌మాదానికి గురి అయింది. బంగాల్ జ‌ల‌పాయ్ గురి దొమోహ‌నీ వ‌ద్ద ప‌ట్టాలు త‌ప్పింది. ఈ ఘ‌ట‌న‌లో ముగ్గురు మ‌ర‌ణించారు. కాగా 20మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ప్ర‌మాదం జ‌రిగిన వెంట‌నే యాక్సిడెంట్ రిలీఫ్ వ్యాన్, మెడిక‌ల్ మెడికల్ వ్యాన్​ను ఘటనా స్థలానికి పంపినట్లు భారతీయ రైల్వే తెలిపింది. సాయంత్రం 5 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్లు స్పష్టం చేసింది. 12 బోగీలు పట్టాలు తప్పాయని పేర్కొంది. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రుల్లో చేర్చినట్లు అధికారులు తెలిపారు. మొత్తం 30 అంబులెన్స్‌లను ఘటనా స్థలికి పంపించారురైలు హఠాత్తుగా ప్రమాదానికి గురికావడంతో అందులోని ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.

భయంతో రైలు దిగి దూరంగా పరుగులు తీశారు.సహాయక బృందాలు..రెస్క్యూ ట్రైన్‌ను వెంటనే సంఘటనా స్థలానికి పంపింది రైల్వేశాఖ. ఇందులో రైలు బోగీలను కట్ చేసి ప్రయాణికులను బయటకు తీసేందుకు అవసరమైన సామగ్రి ఉంది. ప్రయాణికుల సమాచారం కోసం రైల్వేశాఖ హెల్ప్ లైన్ నంబర్‌ 8134054999ను ప్రకటించింది. బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఫోన్ చేసి ప్రమాద వివరాలను ప్రధాని నరేంద్ర మోదీ తెలుసుకున్నారు. సహాయకచర్యలను వేగంగా చేయాలని సూచించారు. ఘటనపై మమతా బెనర్జీ కూడా ట్వీట్ చేశారు.బికనేర్- గువాహటి ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి గురి కావడం ఆందోళన కలిగించింది. రాష్ట్రానికి చెందిన సీనియర్ అధికారులు, ఉత్తర బంగాల్‌కు చెెందిన డీఎమ్, ఎస్పీ, ఐజీ.. సహాయక చర్యలను దగ్గరుండి పరిశీలిస్తున్నారు. గాయపడినవారికి వీలైనంత త్వరగా వైద్య సాయం అందేందుకు కృషి చేస్తున్నారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు మ‌మ‌తాబెన‌ర్జీ.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement