Wednesday, April 24, 2024

పెళ్లికి వెళ్లి వస్తుండగా విషాదం.. ఎదురెదురుగా ఢీకొన్న కార్లు, 9 మందికి తీవ్ర గాయాలు

తెలంగాణ రాష్ట్రంలోని నాగ‌ర్‌క‌ర్నూల్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద జ‌రిగింది. రెండు కార్లు ప‌ర‌స్ప‌రం ఢీ కొనడంతో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన కల్వకుర్తి మండలం తాండ సమీపంలో ఇవ్వాల సాయంత్రం జ‌రిగింది. ఊరుకొండ మండలానికి చెందిన బాలస్వామి గౌడ్, శివయ్య, యాదయ్యగౌడ్, అంజమ్మ, అనిత, తేజ.. ఇంద్రకల్ నుంచి దేవరకొండ మండలం తాటికోల్ గ్రామంలో జ‌రిగిన వివాహానికి హాజరై తిరిగి వస్తున్నారు.

కాగా, హైదరాబాద్‌కు చెందిన మధుసూదన్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, పుష్పలత.. మిడ్జిల్ మండలం వెలుగొమ్ముల గ్రామంలో ఓ వివాహానికి హాజరై.. వారి స్వగ్రామం ఖానాపూర్‌కు కల్వకుర్తి మీదుగా వెళ్తున్నారు. ఈ క్రమంలో తాండ సమీపంలో రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో తొమ్మిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులకు కల్వకుర్తి ప్రభుత్వ దవాఖానలో ప్రాథమిక చికిత్స అందించి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. ఈ ప్ర‌మాదానికి సంబంధిచిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement