Wednesday, April 24, 2024

HYD : ఫ్రెండ్ భార్యతో వ్యాపారి జంప్..

హైదరాబాద్ లోని న్యూబోయిన్‌పల్లి చెందిన వ్యాపారి తన ఫ్రెండ్ భార్యతో జంప్ అయ్యాడు. తమను వెతకొద్దంటూ తన భార్యకు లేఖ రాసి మరి పరారయ్యాడు. షిర్డీ వెళ్తున్నాను అని ఇంట్లో చెప్పి.. గత నెల 29న ఫ్రెండ్ భార్యను తీసుకుని వెళ్లాడు వ్యాపారి అతుల్. ఆ నెక్ట్స్ డే నుంచి అతడి ఫోన్ స్విచ్ఛాప్ వచ్చింది. దీంతో అతుల్ భార్య ఆందోళన చెందింది.

ఓ వైపు భర్త సమాచారం కోసం ట్రై చేస్తూనే.. ఇంట్లో వెతగ్గా ఓ లెటర్ కనిపించింది. అది చదవిన అతుల్ భార్య స్టన్ అయ్యింది. ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. తన ఫ్రెండ్ భార్యతో వెళ్లిపోతున్నానని, ఆ విషయం తన మిత్రుడికి కూడా తెలుసునని, తమ కోసం వెతకవద్దన్నది అతుల్ లేఖ సారాంశం. దీంతో అతుల్ భార్య పోలీసులను ఆశ్రయించింది. తన భర్త ఇంట్లో రూ.10 లక్షలు తీసుకొని ప్రియురాలితో వెళ్లిపోయాడని కంప్లైంట్ చేసింది. పోలీసులు దర్యాప్తు షురూ చేశారు. సెల్‌ఫోన్ సిగ్నళ్ల ఆధారంగా అతడి లోకేషన్ ట్రేస్ చేసే పనిలో పడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement