Friday, April 19, 2024

కౌశిక్ సంగతి తెలుసు.. హుజురాబాద్ అభ్యర్థి సస్పెన్స్: రేవంత్

హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తమ అభ్యర్థి తర్జనభర్జన పడుతున్నాయి. టీఆర్ఎస్ టికెట్ తనకే అంటూ కాంగ్రెస్ నేత పాడి కౌశిక్ రెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పారు. దీంతో కాంగ్రెస్ నుంచి బరిలో దిగే అభ్యర్థి ఎవరు ? అన్నది ఉత్కంఠగా మారింది. ఈ క్రమంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హుజురాబాద్ లో తమ అభ్యర్థిని ఇప్పుడే చెప్పం..కానీ మంచి అభ్యర్థిని ప్రకటిస్తామని రేవంత్ పేర్కొన్నారు. తనకు కౌశిక్ వ్యవహారం ముందే తెలుసు చెప్పారు. టీఆర్ఎస్ తో టచ్ లో ఉన్నాడని తనకు సమాచారం ఉందని, అక్కడ కౌశిక్ కు టీఆర్ఎస్ టికెట్ ఇస్తారని అనుకోవడం లేదన్నారు. టీఆరెస్ ప్రచారం చేస్తున్నా.. వారికీ అభ్యర్థి కరువయ్యాడని విమర్శించారు. చాలా మంది ఇతర పార్టీల నేతలు టచ్ లోకి వస్తున్నారని చెప్పారు. ముగ్గురు కీలక సామాజిక వర్గాలకు చెందిన నేతలు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారన్నారు. కౌశిక్ మాటలు కాదు.. కేసీఆర్ మాట్లాడించిన మాటలు అని రేవంత్ మండిపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement