Saturday, April 20, 2024

లోయ‌లో ప‌డిన టూరిస్ట్ బ‌స్సు – ఆరుగురు మృతి – 30మందికి తీవ్ర గాయాలు

ప్ర‌యాణికుల‌తో వెళుతోన్న టూరిస్ట్ బ‌స్సు అదుపుత‌ప్పి బోల్తా ప‌డింది. ఈ ఘ‌ట‌న‌లో ఆరుగురు మృతి చెందారు. మ‌రో 30మందికి గాయాలు అయ్యాయి. ఈ ప్ర‌మాదం ఒడిశా గంజామ్​-కంధమల్​ సరిహద్దుల్లో చోటు చేసుకుంది. ఘాట్ రోడ్ పై బస్సు అదుపుతప్పడంతో లోయలోకి పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. మృతుల్లో ముగ్గురు మహిళలు వున్నారు. బస్ ప్రమాదాన్ని గుర్తించినవారు వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని స్థానికుల సహాయంతో సహాయక చర్యలు చేపట్టారు. ముందుగా గాయపడిన వారిని కాపాడి దగ్గర్లోని బెర్హమ్​పుర్​ ఎంకేసీజీ ఆసుపత్రికి, మరికొందరిని భంజానగర్​ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మృతదేహాలను కూడా పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్ కు తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. బస్సు బ్రేక్ ఫెయిల్ అవడంతో డ్రైవర్ కంట్రోల్ చేయలేకపోయాడని… ఘాట్ రోడ్డుపై బ్రేకుల్లేకుండా డ్రైవింగ్ అసాధ్యం కాబట్టి బస్సు బోల్తాపడినట్లు ప్రాథమికంగా నిర్దారించారు అధికారులు. అయితే పూర్తి దర్యాప్తు అనంతరం ఈ టూరిస్ట్ బస్సు ప్రమాదానికి గల కారణాలు బయటపడతాయని పోలీసులు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement