Wednesday, March 27, 2024

Tollywood Drug case : ఈడీ విచారణకు హాజరైన నటుడు తనీష్

టాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారణలో ఈ డి దూకుడు పెంచింది శుక్రవారం నటుడు తనిష్ ఈడీ అధికారులు ముందుకు హాజరయ్యాడు.మనీలాండరింగ్‌ కేసులో తనీష్‌కు నోటీసులు ఇచ్చిన ఈడీ..తనీష్ బ్యాంకు ఖాతాల లావాదేవీలు పరిశీలించనుంది.

డ్రగ్ కేసులో ఇప్పటికే పలువురు సినీ తారలు అధికారులు విచారించారు. డైరెక్టర్ పూరి జగన్నాథ్, హీరోయిన్స్ ఛార్మి, రకుల్ ప్రీత్ సింగ్, హీరోలు రవితేజ, దగ్గుబాటి రానా తదితరులు ఇప్పటికే విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. ప్రధాన నిందితుడు కెల్విన్ తో ఉన్న సంబంధాలు, బ్యాంకు లావాదేవీలపై ఈ డి విచారణ చేస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement