Monday, April 15, 2024

చీటీ పేరుతో టోకరా.. రూ. కోటితో పరారైన నిందితుడు, పోలీస్‌స్టేషన్‌లో బాధితులు ఫిర్యాదు

మహదేవపూర్‌, ప్రభన్యూస్‌: జయశంకర్‌భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలంలోని చిట్‌ఫండ్‌ పేరుతో ఓ చిట్‌ వ్యాపారి బాధితులను బారీగా మోసం చేసి ఎగనామం పెట్టాడు. మహదేవపూర్‌ మండలానికి చెందిన శివ అన్నపూర్ణ హోటల్‌ను నిర్వహిస్తూ, బ్రిక్స్‌ తయారి కంపెనీనీ ఏర్పాటు చేసి అందులో లాస్‌ రావడంతో చిట్‌ఫండ్‌ పేరుతో చిరువ్యాపారులను నమ్మించి రోజువారిగా చిట్‌ డబ్బులు వసూలు చేస్తూ పెద్ద ఎత్తున కోటీ రూపాయలతో ఎగనామం పెట్టి పారిపోయాడు. బాధితులు వెంటనే పోలీసులకు సమాచారం అందించి ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement