Friday, March 29, 2024

నేడు తిరుపతికి శ్రీలంక ప్రధాని మహీంద్ర రాజపక్సే

శ్రీలంక ప్ర‌ధాని మ‌హింద్ర రాజ‌ప‌క్సే నేడు తిరుప‌తికి వస్తున్నారు. శ్రీలంక ప్ర‌ధాని ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో తిరుప‌తితో పాటు తిరుమ‌ల‌లో పోలీసులు ప‌టిష్ట బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. ఇవాళ ఉద‌యం 11.10 గంట‌ల‌కు రాజ‌ప‌క్సే తిరుమ‌ల ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్నారు. మ‌ధ్యాహ్నం 12:30కు తిరుమ‌ల శ్రీకృష్ణ అతిథి గృహానికి చేరుకుంటారు. ఇవాళ రాత్రికి తిరుమ‌ల‌లోనే శ్రీలంక ప్ర‌ధాని బ‌స చేయ‌నున్నారు. రేపు ఉద‌యం 7:30 గంట‌ల‌కు వీవీఐపీ బ్రేక్ ద‌ర్శ‌నంలో శ్రీవారిని ద‌ర్శించుకుని మొక్కులు చెల్లించుకోనున్నారు. అనంత‌రం రేపు సాయంత్రం తిరిగి శ్రీలంక‌కు మ‌హింద్ర రాజ‌ప‌క్సే వెళ్ల‌నున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement