Wednesday, April 17, 2024

Today : బంగారం.. వెండి ధ‌ర‌లు

నేడు బంగారం.. వెండి ధ‌ర‌లు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లో బంగారం ధర నేడు స్వల్పంగా పెరిగింది. ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ.300 పెరిగి రూ.56 వేలకు చేరింది. అయినప్పటికీ 2 నెలల కనిష్ఠ స్థాయి వద్దే ఉండడం ఊరట కలిగించే అంశం. 24 క్యారెట్ల స్వచ్ఛమైన గోల్డ్ రేటు తులానికి రూ.340 పెరిగింది. ప్రస్తుతం తులం రేటు రూ.61 వేల 100 పలుకుతోంది. ఇక దేశ రాజధాని ఢిల్లీ మహా నగరంలో 22 క్యారెట్ల బంగారం ధర ఇవాళ 10 గ్రాములకు రూ.300 పెరిగి ప్రస్తుతం రూ.56 వేల 150 వద్ద కొనసాగుతోంది. ఇక 24 క్యారెట్ల మేలిమి గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ.320 పెరిగి రూ.61 వేల 250 పలుకుతోంది. వెండి విషయానికి వస్తే ఇవాళ సైతం మళ్లీ ధరలు పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి రేటు రూ.600 పెరిగింది. ప్రస్తుతం కిలో రేటు రూ.73 వేల 400 పలుకుతోంది. ఇక మన హైదరాబాద్‌లో కిలో వెండి ధర ఏకంగా రూ.1000 పెరిగింది. ఇప్పుడు కిలో రేటు రూ.78 వేల 600 వద్ద ట్రేడవుతోంది. ఢిల్లీ, హైదరాబాద్ మధ్య గోల్డ్, సిల్వర్ రేట్లలో భారీ వ్యత్యాసం కనిపిస్తుంది. అందుకు ప్రధాన కారణంగా స్థానిక పన్నులు, కమీషన్ వంటివి ఉంటాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement