Thursday, April 18, 2024

నేటి బంగారం.. వెండి ధ‌ర‌లు

నేటి బంగారం..వెండి ధ‌ర‌లు ఇలా ఉన్నాయి.హైదరాబాద్‌లో బంగారం 22 క్యారెట్ల 10 గ్రాములకు రూ.100 మేర పెరిగింది. ప్రస్తుతం తులం రేటు రూ.51 వేల 850 వద్ద ట్రేడవుతోంది. ఇక 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం రేటు హైదరాబాద్‌లో తులానికి రూ. 100 పెరిగింది. ప్రస్తుతం రూ.56 వేల 550 వద్ద ఉంది. ఇక దేశ రాజధాని దిల్లీలో గోల్డ్ రేటు 22 క్యారెట్లకు తులానికి రూ.50 పెరిగి ప్రస్తుతం రూ.51 వేల 950 వద్ద ఉంది. మరోవైపు.. 24 క్యారెట్ల మేలిమి బంగారం మాత్రం దిల్లీలో రూ.50 తగ్గింది. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం దిల్లీలో రూ.56 వేల 550 వద్ద ట్రేడవుతోంది.వెండి విషయానికి వస్తే గత మూడు రోజులుగా స్థిరంగా కొనసాగుతోంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర ప్రస్తుతం ఎలాంటి మార్పు లేకుండా రూ.70,000 వద్ద ఉంది. ఒక దశలో వెండి రేటు రూ.76 వేల మార్కుపైకి చేరడం తెలిసిందే. ఇప్పుడు తక్కువ స్థాయిలోనే ఉండడం ఊరటగానే చెప్పాలి. దిల్లీలో వెండి ధర చూసుకుంటే శనివారం రూ.400 పెరగగా.. ఇవాళ స్థిరంగా ఉంది. ప్రస్తుతం కిలో వెండి రేటు రూ.66,900 వద్ద ట్రేడవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement