Wednesday, April 17, 2024

Today : బంగారం.. వెండి ధ‌ర‌లు

నేటి బంగారం.. వెండి ధ‌ర‌లు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లో ఇవాళ 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.300 పెరిగింది. ప్రస్తుతం తులం రేటు రూ.55 వేల 600 మార్క్ వద్ద కొనసాగుతోంది. ఇక 24 క్యారెట్ల మేలిమి గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ.60 వేల 650 వద్ద ట్రేడవుతోంది. ఇక దేశ రాజధాని ఢిల్లీ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.300 పెరిగి రూ.55 వేల 750 వద్దకు చేరింది. ఇక 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర తులానికి ఢిల్లీలో రూ.320 పెరిగి ప్రస్తుతం రూ.60 వేల 800 మార్క్ వద్ద ట్రేడవుతోంది. వెండి విషయానికి వస్తే బంగారం దారిలోనే నడుస్తోంది. ఇవాళ కిలో వెండి రేటు కాస్త పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్లో చూసుకుంటే కిలో వెండిపై రూ.500 పెరిగింది. ప్రస్తుతం రూ. 73 వేల 500 పలుకుతోంది. ఇక హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.300 పెరిగింది. ప్రస్తుతం కిలో రేటు రూ. 78 వేల మార్క్ వద్ద కొనసాగుతోంది.

ఢిల్లీ, హైదరాబాద్ నగరాల్లో గోల్డ్, సిల్వర్ రేట్లలో భారీగా వ్యత్యాసం ఉంటుంది. హైదరాబాద్‌లో బంగారం రేటు కాస్త తక్కువగా, వెండి రేటు కాస్త ఎక్కువగా ఉంటుంది. అందుకు అక్కడి ట్యాక్సులు, కమీషన్ల వంటివి కారణంగా మారతాయి.అంతర్జాతీయ మార్కెట్లో చూసుకుంటే ఇవాళ గోల్డ్, సిల్వర్ రేట్లు కాస్త పెరిగాయి. అయినప్పటికీ ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు భయాలు కొనసాగుతుండడంతో డాలర్ పుంజుకుంటోంది. దాంతో బంగారం ధరలపై ఒత్తిడి పడుతోంది. ఈ కారణంగా గోల్డ్ రేట్లు ముందు ముందు తగ్గనున్నాయని నిపుణులు చెబుతున్నారు. అయితే, ఇవాళ మాత్రం ధరలు కాస్త పెరిగాయి. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 1965 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 23.57 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. భారత కరెన్సీ రూపాయి మారకం విలువ గ్లోబల్ మార్కెట్లో డాలర్‌తో పోలిస్తే రూ.82.525 వద్ద కొనసాగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement