Thursday, April 25, 2024

నేటి బంగారం.. వెండి ధ‌ర‌లు

నేటి బంగారం..వెండి ధ‌ర‌లు ఇలా ఉన్నాయి.. శ్రీరామ‌న‌వ‌మి ప‌ర్వ‌దినాన బంగారం ధ‌ర‌లు కాస్త పెరిగాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్లకు చెందిన బంగారం 10 గ్రాములకు రూ.200 మేర పెరిగింది. ప్రస్తుతం రూ.54 వేల 700 మార్క్ వద్ద ట్రేడవుతోంది. మరోవైపు.. 24 క్యారెట్లకు చెందిన స్వచ్ఛమైన పసిడి ధర తులానికి రూ.220 పెరిగి ప్రస్తుతం రూ.59 వేల 670 వద్ద కొనసాగుతోంది. ఇక దేశ రాజధాని దిల్లీలో 22 క్యారెట్ల బంగారం రేటు రూ.200 పెరిగి ప్రస్తుతం రూ.54 వేల 850 వద్ద ఉంది. ఇక 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర దిల్లీలో తులానికి రూ.220 పెరిగి ప్రస్తుతం రూ.59 వేల 820 వద్ద ఉంది. వెండి విషయానికి వస్తే ఇవాళ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశ రాజధాని దిల్లీలో కిలో వెండి రేటు రూ.73000 పలుకుతోంది. ఇక తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో కిలో సిల్వర్ ధర క్రితం సెషన్‌లో రూ.300 తగ్గగా ఇవాళ స్థిరంగా ఉంది. ప్రస్తుతం కిలో వెండి రేటు రూ.75 వేల 700 వద్ద ట్రేడవుతోంది. దిల్లీతో పోలిస్తే హైదరాబాద్‌లో వెండి రేటు కాస్త ఎక్కువగా బంగారం రేటు కాస్త తక్కువగా ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement