Thursday, April 25, 2024

నేటి బంగారం.. వెండి ధ‌ర‌లు ఎలా ఉన్నాయంటే..

నేటి బంగారం..వెండి ధ‌ర‌లు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లో బంగారం ధర 22 క్యారెట్లకు తాజాగా 150 మేర తగ్గింది. ప్రస్తుతం రూ.54 వేల 850 వద్ద కొనసాగుతోంది. ఇక 24 క్యారెట్ల స్వచ్ఛమైన పసిడి ధర తులానికి రూ.160 మేర తగ్గి రూ.59 వేల 840 వద్ద ట్రేడవుతోంది. ఇక దేశ రాజధాని దిల్లీలో చూసుకున్నట్లయితే 22 క్యారెట్ల బంగారం ధర రూ.200 మేర తగ్గి రూ.54, 950 వద్ద ఉంది. ఇక 24 క్యారెట్ల మేలిమి బంగారం రేటు రూ.160 తగ్గింది. ప్రస్తుతం రూ.59 వేల 990 వద్ద కొనసాగుతోంది.వెండి విషయానికి వస్తే హైదరాబాద్‌లో కిలో వెండి రేటు రూ.300 మేర పెరిగింది. ప్రస్తుతం కిలో పుత్తడి రేటు రూ.76 వేలు పలుకుతోంది. ఇక దేశ రాజధాని దిల్లీలో కిలో వెండి రేటు రూ.330 మేర పెరిగి ప్రస్తుతం రూ.73 వేల 300 మార్క్ వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్‌తో పోలిస్తే దేశ రాజధాని హస్తినాలో బంగారం రేటు కాస్త ఎక్కువ, వెండి రేటు కాస్త తక్కువగా ఉంటుంది. అందుకు స్థానికంగా ఆయా ప్రాంతాల్లో ఉండే ట్యాక్సులు కారణం.

Advertisement

తాజా వార్తలు

Advertisement