Saturday, April 20, 2024

నేటి బంగారం.. వెండి ధ‌ర‌లు

నేటి బంగారం..వెండి ధ‌ర‌లు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.290 పెరిగింది. ప్రస్తుతం రూ.52 వేల 450 మార్క్ వద్ద ట్రేడవుతోంది. ఇక 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాములకు హైదరాబాద్‌లో రూ.330 మేర పెరిగి.. ప్రస్తుతం రూ.57 వేల 220 వద్ద అమ్ముడవుతోంది. మరోవైపు.. దేశ రాజధాని దిల్లీలో 22 క్యారెట్ల బంగారం తులానికి రూ.290 పెరిగి ప్రస్తుతం రూ.52 వేల 600 వద్ద ఉంది. ఇక 24 క్యారెట్ల మేలిమి బంగారం దిల్లీలో 10 గ్రాములకు రూ.320 పెరిగింది. ప్రస్తుతం రూ.57 వేల 370 వద్ద కొనసాగుతోంది..ఇక వెండి విషయానికి వస్తే పసిడి దారిలోనే నడుస్తూ రోజు రోజుకు ధరలు మరింత పెరుగుతున్నాయి. హైదరాబాద్‌లో కిలో వెండి ధర నాలుగు రోజుల్లోనే రూ.2000వేలకుపైగా పెరిగింది. ఇవాళ్టి ధరలు చూసుకుంటే కిలో వెండి ధర రూ. 800 మేర పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి హైదరాబాద్‌లో రూ.69 వేల 500 పలుకుతోంది. దేశ రాజధాని దిల్లీలో కిలో వెండి ధర రూ.330 పెరిగి ప్రస్తుతం రూ.66 వేల వద్ద కొనసాగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement