Sunday, March 24, 2024

ఇందిరాపార్కు వద్ద రైతు సంఘాలు మహాధర్నా

వ్యవసాయ చట్టాల రద్దును పార్లమెంట్‌లో ఆమోదించాలని డిమాండ్‌ చేస్తూ నేడు హైదరాబాద్‌లో రైతు సంఘాలు మహాధర్నా చేయనున్నారు. సాగు చట్టాలు రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ చేపట్టిన రైతు ఉద్యమానికి ఏడాది పూర్తయిన సందర్భంగా అఖిల భారత రైతు పోరాట సమన్వయ సమితి(ఏఐకేఎంఎస్‌‌), సంయుక్త కిసాన్‌ మోర్చా(ఎస్‌కేఎం) పిలుపు మేరకు ఇందిరా పార్క్‌ వద్ద ధర్నా జరగనుంది.

నేడు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ మహాధర్నా సాగుతుంది. అన్ని రకాల వ్యవసాయ పంటలకు కనీస మద్దతు ధరల చట్టం ప్రవేశపెట్టి అమలు చేయాలని ఈ వేదిక ద్వారా కిసాన్‌ నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కిసాన్‌ మోర్చా(ఎస్‌కేఎం) నేత రాకేశ్ టికాయత్‌ పాల్గొననున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement