Saturday, April 20, 2024

మరో మూడు పిల్లలకి జన్మనిచ్చిన.. పులి జూనాబాయి

మరో మూడు పిల్లలకి జన్మనిచ్చింది మహారాష్ట్రలోని తాడోబా అభయారణ్యాన్ని సందర్శించే పర్యాటకులను అలరించే పులి ‘జూనాబాయి’ . దీంతో ఇప్పటి వరకు ఆ పులి మొత్తంగా 17 పిల్లలకు జన్మనిచ్చింది. 9 సంవత్సరాల వయసున్న జూనాబాయి తొలి కాన్పులో మూడు పిల్లలకు జన్మనిచ్చింది. రెండోసారి నాలుగు, మూడోసారి మూడు, నాలుగోసారి నాలుగు పిల్లలకు జన్మనిచ్చిన జూనాబాయి.. తాజాగా ఐదో కాన్పులో మరో మూడు పిల్లలకు జన్మనిచ్చింది. దీంతో తాడోబా అభయారణ్యంలో దాని సంతతి పెరుగుతోంది. పులులకు పుట్టినిల్లుగా పేరుగాంచిన తాడోబా అభయారణ్యంలో జూనాబాయి కాకుండా మత్కనూరు, మోగ్లీ తదితర పేర్లున్న పులులు కూడా ఉన్నాయి. టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌ తరచూ ఈ అభయారణ్యాన్ని సందర్శిస్తూ ఉంటాడు. ఇక్కడికొచ్చినప్పుడు సచిన్ జూనాబాయిని చూడకుండా వెళ్లడు. అదంటే సచిన్‌కు అంత ఇష్టం.

Advertisement

తాజా వార్తలు

Advertisement