Thursday, April 25, 2024

మెక్సికో జైలుపై దుండగుల కాల్పులు.. 14 మంది మృతి

మెక్సికోలోని ఓ జైలుపై దుండగులు కాల్పుల‌కు పాల్పడడంతో 14 మంది మృతిచెందారు. మెక్సికో సరిహద్దు నగరమైన జువారెజ్‌లో ఉన్న సెంట్రల్‌ జైలుపై సాయుధులైన గుర్తుతెలియని వ్యక్తులు దాడికి దిగారు. విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో 14 మంది అక్కడికక్కడే మరణించారు. వారిలో 10 మంది భద్రతా సిబ్బంది, నలుగురు ఖైదీలు ఉన్నారని అధికారులు తెలిపారు. ఎస్‌యూవీల్లో వచ్చిన దుండగులు ఒక్కసారిగా జైలు సెక్కూరిటీ సిబ్బందిపై కాల్పులు జరిపారని, జైలులోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారని అధికారులు వెల్లడించారు. అయితే దుండగుల కాల్పుల్లో భద్రతా సిబ్బందితోపాటు నలుగురు ఖైదీలు చనిపోయారని, మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. వెంటనే అప్రమత్తమైన సైన్యం, స్థానిక పోలీసులు ఎదురు కాల్పులు జరిపారని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement