Tuesday, March 26, 2024

Breaking: బాసరలో ఒకే ఫ్యామిలీకి చెందిన ముగ్గురు ఆత్మహత్య

తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ జిల్లా బాసరలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. బాసరలో ఒకే కుటుంబానికి ముగ్గురు గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆత్మహత్య చేసుకున్నవారు ఒకే ఫ్యామిలీకి చెందిన తల్లి మానస, బాలాదిత్య, భవ్యశ్రీగా గుర్తించారు. మృత‌దేహాల‌ను గజ ఈతగాళ్లు ఒడ్డుకు చేర్చారు. ఆత్మహత్య చేసుకున్న కుటుంబం నిజామాబాద్ కు చెందినదిగా గుర్తించారు. ఆర్థిక ఇబ్బందులే వీరి ఆత్మహత్యకు కారణంగా తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement