Thursday, April 18, 2024

Crime News: ఉద్యోగాల పేరుతో కుచ్చుటోపీ.. కిలాడీ ఫ్యామిలీ అరెస్టు

వరంగల్ కమిషనరేట్ పరిధితో పాటు చుట్టు ప్రక్కల జిల్లాల్లో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల వద్ద డబ్బులు వసూళ్ళకు పాల్పడిన ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నలుగురు సభ్యుల ముఠాలోని ముగ్గురు నిందితులను టాస్క్ ఫోర్స్  పోలీసులు సొమవారం అరెస్టు చేయగా మరో నిందితుడు ప్రస్తుతం పరారీలో వున్నాడు. పోలీసులు అరెస్టు చేసిన నిందితుల నుండి 21 లక్షల 70వేల రూపాయల నగదు, రెండు ఖరీదైన కార్లతో పాటు రెండు సెల్‌ఫోన్లు, నకిలీ గుర్తింపు కార్డులు, ఇతర నకిలీ పత్రాలు, స్కౌట్స్ అండ్ గైడ్స్ విభాగానికి సంబంధించిన బెల్ట్, టోపీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు చల్లా వినయ్ పాల్ రెడ్డి,. పోరిక అనసూయ, లావుడ్యా నవీన్ సాకేత్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ కేసుకు సంబందించి వివరాలను వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి మీడియాకు వెల్లడించారు. నిందితుల్లో ఒకడైన వినయ్ పాల్ రెడ్డికి 2009 సంవత్సరంలో వి.ఆర్.ఓగా ప్రభుత్వ ఉద్యోగంలో చేరి ములుగు జిల్లా బండారు పల్లె గ్రామ వి.ఆర్.ఓ విధులు నిర్వహించేవాడు. నిందితుడికి ఇదే సమయంలో ములుగు రెవెన్యూ విభాగం ఆవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న పోరిక అనసూయతో పరిచయం కావడంతో ఇరువురుకి గతంలో పెళ్ళిళ్ళు అయిన వీరు ఇరువురు కొద్ది కాలం సహజీవనం చేసి వివాహం చేసుకున్నారు. నిందితులిద్దరూ రెవెన్యూ విభాగంలో ఉద్యోస్తులు కావడంతో నకిలీ దస్తావేజులు, డాక్యూమెంట్లను తయారు చేసి అవినీతికి పాల్పడ్డారు. ఈ క్రమంలో  2012లో నిందితులపై ములుగు పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు కావడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగాల నుండి తొలగించారు. అనంతరం నిందితులకు నకిలీ జాతీయ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆర్గనైజేషన్ ఇండియా విభాగం కమిషనర్ రాజ్ కె.పి.సిన్హా అనే వ్యక్తితో ఢిల్లీలో పరిచయం అయింది. ఇతని ద్వారా స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆర్గనైజేషన్ ఇండియా విభాగం పేరుతో నిరుద్యోగులకు ఉద్యోగాలను ఇప్పిస్తామని నమ్మించి నిరుద్యోగుల నుండి డబ్బులు వసూళ్ళ పాల్పడేందుకు నిందితులు ప్రక్కా ప్రణాళికను రూపొందించుకున్నారు. ఇందులో భాగంగా ప్రధాన నిందితుడైన వినయ్ పాల్ రెడ్డి స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆర్గనైజేషన్ ఏ.పి విభాగం, భార్య పోరిక అనసూయను స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆర్గనైజేషన్ తెలంగాణ విభాగానికి కమిషనర్లుగా, మరో నిందితుడు సాకేతను అసిస్టెంట్ కమిషనర్‌గా నకిలీ హోదాలతో నిరుద్యోగులను మోసంచేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆర్గనైజేషన్ ఇండియా ద్వారా జిల్లా ఆర్గనైజేషన్ కమిషనర్, స్కౌట్ మాస్టర్, గైడ్ కెప్టెన్ ఉద్యోగ నియామాలను చేపట్టడం జరుగుతుందని ప్రచారం చేయడంతో నిరుద్యోగులు ఉద్యోగాన్ని బట్టి ఒక్కోక్క నిరుద్యోగి నుండి సుమారు 5 లక్షల నుండి 3 లక్షల వరకు డబ్బులు వసూళ్ళకు పాల్పడ్డారు. 2019 ఆగస్టు నుండి గతేడాది ఆగస్టు వరకు 241 మంది నిరుద్యోగులను వరంగల్, నల్గొండ ప్రాంతాల్లో 15రోజుల పాటు శిక్షణ అందజేసి శిక్షణ అనంతరం వరంగల్, నర్సంపేట్, నెక్కోండ, హన్మకొండ, నల్గొండ, మంచిర్యాల్, ములుగు, కరీంనగర్ జిల్లా లోని వివిధ పాఠశాల్లో విధులు నిర్వహించాల్సిందిగా నకిలీ ఉత్తర్వులను అందజేసారు. నకిలీ ఉత్తర్వులతో ఆయా ప్రాంతాలకు విధులు నిర్వహించేందుకు ఉత్సహంగా వెళ్ళిన నిరుద్యోగులకు ఈ ఉత్తర్వులు నకిలీ అని తెలియడంతో కంగుతిన్నారు. దీనితో బాధిత నిరుద్యోగులు ఈ ముఠా సభ్యులను నిలదీయటంతో పాటుతాము ఇచ్చిన డబ్బులను తిరిగి ఇవ్వాల్సిందిగా నిందితులపై ఒత్తిడి చేశారు. అయితే, నిందితులు నిరుద్యోగులను బెదిరింపులు పాల్పడుతున్నట్లుగా టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారం అందడంతో రంగంలోకి దిగిన ట్క్ఫా ర్స్ పోలీసులు ముగ్గురు నిందితులను విచారించగా వారు మోసాలను పాల్పడినట్లు అంగీకరించారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన పోలీసులకు పోలీస్ కమిషనర్ అభినందించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement