Wednesday, April 24, 2024

దేశవ్యాప్తంగా 3.79 ల‌క్ష‌ల‌ మందికి కరోనా

భార‌త్‌లో క‌రోనా కేసుల పెరుగుదల ఆగడం లేదు రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 3,79,257 మందికి కరోనా నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,83,76,524 కు చేరింది. అదే సమయంలో నిన్న 2,69,507 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గడచిన 24 గంట‌ల సమయంలో 3,645 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 2,04,832  కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,50,86,878 మంది కోలుకున్నారు. 30,84,814   మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. అటు వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగమంతమవుతోంది.. దేశ వ్యాప్తంగా 15,00,20,648 మందికి వ్యాక్సిన్లు వేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement