మంచు చరియలు విరిగిపడి ముగ్గురు జవాన్లు మృతిచెందిన విషాద ఘటన జమ్మూ కశ్మీర్లోని కుప్వారా జిల్లాలో చోటుచేసుకుంది. మచిల్ సెక్టార్లో నియంత్రణ రేఖ వద్ద మంచు చరియలు విరిగిడపడడంతో ముగ్గురు జవాన్లు మృతిచెందారు. 56 రాష్ట్రీయ రైఫిల్స్కు చెందిన జవాన్ల బృందం పెట్రోలింగ్కు వెళ్లింది. పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా, ప్రమాదవశాత్తు మంచుచరియలు విరిగిపడటంతో.. ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. హిమపాతంలో చిక్కుకుపోయిన మరో ఇద్దరు జవాన్లను రక్షించి, కుప్వారాలోని మిలిటరీ ఆస్పత్రికి తరలించారు. మృతిచెందిన జవాన్లకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement