Thursday, March 28, 2024

Breaking: రాజధాని ఎక్స్ ప్రెస్ రైలు ఢీకొని… ముగ్గురు మృతి

రైలు ఢీకొని ముగ్గురు మృతిచెందిన సంఘటన పెద్దపల్లి జిల్లా స్టేషన్ కొత్తపల్లి శివారులో చోటుచేసుకుంది. ఈరోజు ట్రాక్ మరమ్మతులు చేస్తున్న సమయంలో రైలు ఢీకొని రైల్వే సిబ్బంది ఒకరు, దినసరి కూలీలు ఇద్దరూ.. మొత్తం ముగ్గురు మృతి చెందారు. రైల్వే ట్రాక్లకు గ్రీసింగ్ చేస్తున్న సమయంలో పక్క ట్రాక్ నుండి గూడ్స్ రైలు వెళుతుండగా ఆ శబ్దంతో పనిచేస్తున్న ట్రాక్ పై రాజధాని ఎక్స్ ప్రెస్ ను గమనించకపోవడంతో రాజధాని ఎక్స్ ప్రెస్ రైలు ఢీకొంది. ఈ ప్రమాదంలో రైల్వే సిబ్బంది అయిన దుర్గయ్య, దినసరి కూలీలు పెద్దకల్వల, సుల్తానాబాద్ లకు చెందిన శ్రీనివాస్, వేణులుగా అనుమానిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement