Thursday, April 25, 2024

Breaking: ఘోర రోడ్డుప్ర‌మాదం… ముగ్గురు మృతి

ఘోర రోడ్డుప్ర‌మాదంలో ముగ్గురు మృతిచెందిన విషాద వ‌న‌ప‌ర్తి జిల్లాలోని కొత్తకోట మండలం ముమ్మాళ్లపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌-బెంగళూరు జాతీయ రహదారిపై ముమ్మాళ్లపల్లి వద్ద ముందు వెళ్తున్న చెరుకు ట్రాక్టర్‌ను మియాపూర్‌ డిపోకు చెందిన గరుడ బస్సు ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందగా.. మరో 15 మంది గాయపడ్డారు. ప్రమాద ధాటికి బస్సు ముందుభాగం నుజ్జునుజ్జయ్యింది. బస్సు హైదరాబాద్‌ నుంచి బెంగళూరు వెళ్తుండగా ప్రమాదం జరిగిందన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను వనపర్తి జిల్లా దవాఖానకు తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 48 మంది ఉన్నారని పోలీసులు తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement