Monday, April 15, 2024

Flash: సీఆర్పీఎఫ్ క్యాంపుపై నక్సలైట్లు దాడి.. ముగ్గురు జవాన్లుకు గాయం

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం సుక్మాలోని సీఆర్పీఎఫ్ క్యాంపుపై సోమవారం ఉదయం నక్సలైట్లు దాడి చేశారు. నక్సలైట్లు జరిపిన కాల్పుల్లో ముగ్గురు జవాన్లు గాయపడినట్లు సమాచారం. ఈ శిబిరాన్ని నెల రోజుల క్రితమే ప్రారంభించారు. ఈ ఘటన చింతగుఫా ప్రాంతంలో చోటుచేసుకుంది.

చింతగుఫా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఎల్మగుండ క్యాంపు పరిసరాల్లో ఉదయం 6 గంటలకు మావోయిస్టుల బృందం కాల్పులు ప్రారంభించింది. ఈ ఘటనలో సీఆర్పీఎఫ్ 2వ బెటాలియన్‌కు చెందిన హెడ్ కానిస్టేబుల్ హేమంత్ చౌదరి, కానిస్టేబుళ్లు బసప్ప, లలిత్ బాగ్ గాయపడ్డారు. ప్రస్తుతం మిగిలిన సమాచారం అందాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement