Friday, April 19, 2024

ముగ్గురు పిల్లల్ని కాల్చి చంపి : తండ్రి ఆత్మ‌హ‌త్య

ముగ్గురు పిల్ల‌ల‌ను కాల్చి చంపి, ఆ త‌ర్వాత తండ్రి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన ఘ‌ట‌న‌ అమెరికాలో చోటుచేసుకుంది. కాలిఫోర్నియాలో ఓ వ్యక్తి.. తన ముగ్గురు పిల్లలు సహా మరొకరిని కాల్చి చంపాడు. అనంతరం.. నిందితుడు కూడా గన్​తో కాల్చుకొని చనిపోయాడు. సక్రామెంటోలోని ఓ చర్చిలో సోమవారం ఈ ఘటన జరిగింది. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో.. కాల్పులు వినిపించాయని, ఐదుగురు చనిపోయిన ఉన్నట్లు చర్చి నిర్వాహకులు వెల్లడించారు. మృతుల్లో ముగ్గురు 15 ఏళ్ల లోపు వారని పేర్కొన్నారు. నిందితుడు కాకుండా మరో వ్యక్తి ఎవరనేది ఇంకా తెలియాల్సి ఉంద‌ని చ‌ర్చి నిర్వాహ‌కులు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement