Thursday, April 25, 2024

ఈసారి భ‌క్తుల స‌మ‌క్షంలోనే సీతారాముల‌ క‌ల్యాణం.. బ్ర‌హ్మోత్స‌వాల‌కు రెడీ కానున్న భ‌ద్రాద్రి..

భ‌ద్రాచ‌లం సీతారాముల క‌ల్యాణం ఈ ఏడాది అంగ‌రంగ వైభవంగా జ‌ర‌గ‌నుంది. ఏటా ల‌క్ష‌లాది మంది భ‌క్తుల సమక్షంలో కోలాహ‌లంగా సాగే రామ‌య్య‌ క‌ల్యాణం.. క‌రోనా కార‌ణంగా రెండేళ్లుగా ఏకాంతంగానే జ‌రుగుతోంది. అయితే.. ప్ర‌స్తుతం క‌రోనా ప్ర‌భావం త‌గ్గిపోయిన నేప‌థ్యంలో ఈ సారి మాత్రం సీతా రాముల క‌ల్యాణాన్ని భ‌క్తుల మ‌ధ్యే నిర్వ‌హించాల‌ని తెలంగాణ స‌ర్కారు నిర్ణ‌యించింది. ఈ మేర‌కు భ‌ద్రాచలం ఈవో నుంచి అధికారికంగా ఇవ్వాల ప్ర‌క‌ట‌న వెలువ‌డింది.

ఏప్రిల్ 2వ తేదీ నుంచి 16వ తేదీ వ‌రకు శ్రీరామ న‌వ‌మి తిరు క‌ల్యాణ బ్ర‌హ్మోత్సవాల‌ను నిర్వహించ‌నున్నారు. ఇందులో భాగంగా 10వ తేదీన సీతారాముల క‌ల్యాణ మ‌హోత్స‌వం, 11న మ‌హా ప‌ట్టాభిషేకం చేసి ర‌థోత్స‌వం నిర్వ‌హించ‌నున్నారు. రాములవారి క‌ల్యాణోత్స‌వానికి సంబంధించిన టికెట్ల‌ను ఆన్‌లైన్‌లో విక్ర‌యించ‌నున్న‌ట్లుగా భ‌ద్రాచ‌లం ఈవో ప్ర‌క‌టించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement