Thursday, April 18, 2024

రైల్వే ట్రాక్ను ఎత్తుకెళ్లిన దొంగలు

రోజురోజుకు దొంగ‌త‌నాలు ఎక్కువ‌వుతున్నాయి. గతంలో ఒకసారి రోడ్డు రోలర్ ను దొంగలు మాయం చేసిన ఘటనలు చూశాం. అయితే వెరైటీ దొంగతనాలకు అడ్డాగా బీహార్ మారుతోంది. ఇటీవలే రైలు ఇంజిన్, సెల్ టవర్లు, వాడుకలో లేని బ్రిడ్జిల‌ను ఎత్తుకెళ్లిన దొంగలు.. తాజాగా రైలు పట్టాలు ఎత్తుకెళ్లారు. 2కిలోమీట‌ర్ల వ‌ర‌కు ఉన్న రైలు ప‌ట్టాల‌ను దోచుకెళ్లారు. గ‌త కొన్ని నెల‌లుగా వాడుకలో లేని రైలు పట్టాలను ఊడదీసుకుని వెళ్లారు. సమస్తిపూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. లోహత్ షుగర్ మిల్లు కోసం అప్పట్లో రైల్వే ట్రాక్ వేశారు. అయితే ఆ మిల్లు మూతపడడంతో రైల్వే ట్రాక్నూ ఉపయోగించడం లేదు. ఇదే అదనుగా భావించిన దొంగలు రైల్వే ట్రాక్‌ను మాయం చేసి దానిని స్క్రాప్ డీలర్లకు అమ్మేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement