Sunday, April 14, 2024

ఏటీఎం మెషిన్ లు ఎత్తుకెళ్లిన దొంగ‌లు.. భారీగా న‌గ‌దు లూటీ

రెండు ఏటీఎం మెషిన్‌లను ఎత్తుకెళ్లి భారీగా నగదు లూటీ చేశారు దొంగ‌లు. ఈ సంఘ‌ట‌న రాజ‌స్థాన్ లోని అజ్మీర్ ఆరెయిన్‌ ఏరియా నుంచి ఎత్తుకెళ్ల‌గా ఈ ఏటీఎం మెషిన్‌లో రూ.8 లక్షలు, రూపన్‌గఢ్‌ ఏరియా నుంచి ఎత్తుకెళ్లిన ఏటీఎం మెషిన్‌లో రూ.30 లక్షలు ఉన్నాయని అధికారులు తెలిపారు. ముఖాలకు ముసుగులు ధరించిన దొంగలు ఆ రెండు ఏటీఎం కేంద్రాల్లో చొరబడి ఏటీఎం మెషిన్‌లను పెకిలించిన తీరు వాటిలోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది. రెండు ఏటీఎం కేంద్రాల్లో దొంగతనాలు ఒకేలా జరగడంతో అది ఒకే దొంగల ముఠా పని అని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement