Friday, April 19, 2024

దొంగే కానీ మంచిదొంగ‌.. చోరీ సొమ్ముతో ఏం చేశాడో తెలుసా

వీడు దొంగే కానీ మంచిదొంగ.. అందేంటీ దొంగ‌ల్లో మంచి దొంగ‌లు కూడా ఉంటారా అనుకుంటున్నారా..ఇత‌ని గురించి తెలిస్తే ఔన‌ని మీరే అంటారు. ఒక పోలీసు అధికారి.. ఒక దొంగను విచారణ చేయగా..పోలీసులు అడుగుతున్న ప్రశ్నలకు దొంగ చెబుతున్న జవాబులు విని ఆశ్చర్యపోతూ నవ్వడం పోలీసుల వంతైంది. ఈ ఘటన చత్తీస్‌గడ్‌లోని దుర్గ్‌ పోలీస్టేషన్‌లో చోటు చేసుకుంది. పోలీసులు సిబ్బంది అంతా ఉండగానే అభిషేక్‌ పల్లవ్‌ అనే పోలీస్‌ సూపరింటెండ్‌ అధికారి ఒక దొంగను ఇంటరాగేషన్‌ చేస్తున్నారు.

అందులో భాగంగా ఆ అధికారి.. దొంగను చోరి చేసిన డబ్బును ఏం చేశావ్‌ అని ప్రశ్నించారు. దానికి ఆ దొంగ ఆ డబ్బును పశువుల మేత కోసం విచ్చలవిడిగా ఖర్చు చేశానని, మరికొంత సొమ్మును పేదవాళ్లకు దుప్పట్లు కొన్నానని చెప్పాడు. ఆ దొంగ సమాధానాలకు అధికారుల ఆశ్చర్యపోవడమే గాక వారి ముఖాల్లో నవ్వు తెప్పించాయి. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement