Friday, April 19, 2024

Breaking: బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా.. భయపడేది లేదు.. మల్లారెడ్డి

బీజేపీ తమపై ఎన్ని కుట్రలు చేసినా.. భయపడేది లేదని తెలంగాణ రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దాడులు జరుగుతాయని సీఎం ముందే చెప్పారన్నారు. పాలు అమ్మి బోర్లు వేసి పైకి వచ్చానన్నారు. తన సంస్థలు ఓపెన్ బుక్ అన్నారు. కేంద్ర బలగాలతో తమపై పెద్ద ఎత్తున దాడులు చేశారన్నారు. తాము విద్యా సేవ చేస్తున్నామన్నారు. తన కొడుకు చదవాలన్నా సీటు ఇప్పించుకోలేని పరిస్థితి ఉందని, మేనేజ్ మెంట్ కోటా లేకపోతే డొనేషన్లు ఎలా ఇస్తారని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement