Thursday, April 25, 2024

TS | ఊరికనే కొడుతున్నారు సార్​.. మా పేరెంట్స్​పై కేసు పెట్టండి​!

శంకర్​పల్లి (ప్రభన్యూస్​): ‘‘తల్లిదండ్రులు చీటికిమాటికి నన్ను కొడుతున్నారు. వారిపై కేసు బుక్ చేయండి సార్’’​.. అంటూ ఓ 11 ఏండ్ల పిల్లోడు శంకర్​పల్లి పోలీసులను ఇవ్వాల (మంగళవారం) ఆశ్రయించాడు. దీనిపై చర్యలు తీసుకునే ముందు ఎస్సై సంతోష్​ ఆ తల్లిదండ్రులను పోలీసు స్టేషన్​కు పిలిపించి కౌన్సెలింగ్​ ఇచ్చారు.

శంకర్​పల్లి మున్సిపాలిటీ పరిధిలోని హనుమాన్ నగర్ లో ఉండే నర్సింలు, లక్ష్మీ కుమారుడు రాములు అయిదో తరగతి చదువుతున్నాడు. అతడిని చీటికిమాటికి తల్లిదండ్రులు కొడుతూ ఉండడంతో పేరెంట్స్​పై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ ఫిర్యాదు తీసుకొని తల్లిదండ్రులకు కౌన్సెలింగ్​ ఇచ్చి పంపించినట్టు ఎస్సై సంతోష్ వెల్లడించారు. మరోసారి ఇలాంటి సమస్య ఎదురుకాకుండా చూసుకోవాలని, అబ్బాయిని బాగా చూసుకోవాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement