Friday, April 19, 2024

Breaking: ధాన్యం సేకరణకు దేశంలో ఒకే విధానం ఉండాలి : కేసీఆర్

ధాన్యం సేకరణకు దేశంలో ఒకే విధానం ఉండాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం దీక్ష ప్రారంభమైంది. తెలంగాణ రైతుల పక్షాన నిరసన దీక్ష పేరుతో టీఆర్‌ఎస్‌ దీక్ష చేపట్టింది. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు దీక్షలో పాల్గొన్నారు. ఈసందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ… ఒకే విధానం లేకపోతే రైతులు రోడ్లపైకి రావాల్సి వస్తుందన్నారు. ఇంత దూరం వచ్చి ఆందోళన చేయడానికి కారణమెవరని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement