Friday, April 19, 2024

ప‌ట్టాలు త‌ప్పిన ట్రైన్.. 10మందికి తీవ్ర‌గాయాలు

ట్రైన్ ప‌ట్టాలు త‌ప్ప‌డంతో 10మంది ప్ర‌యాణీకుల‌కు తీవ్ర‌గాయాలైన ఘ‌ట‌న రాజస్థాన్‎లో చోటుచేసుకుంది. పాలి సమీపంలో సూర్యనగరి ఎక్స్‎ప్రెస్‎లోని ఎనిమిది కోచ్‎లు పట్టాలు తప్పాయి.ఈ ప్రమాదంలో సుమారు పది మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు.గమనించిన స్థానికులు, రైల్వే సిబ్బంది క్షతగాత్రులను హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
ముంబై నుంచి సూర్యనగరి ఎక్స్‎ప్రెస్ జోధ్‎పూర్‎కు వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement