Friday, April 19, 2024

School Bus Accident | పొలాల్లోకి దూసుకెళ్లిన స్కూల్ బస్సు.. విహారయాత్రకు వెళ్లిన విద్యార్థులు సేఫ్‌

వెంకటాపూర్ (ప్రభ న్యూస్) : 60 మంది విద్యార్థులతో విహారయాత్రకు వచ్చిన స్కూల్ బస్సు అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. బస్సులో ఉన్న విద్యార్థులు క్షేమంగా బయటపడ్డారు. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని పాలంపేటలోని రామప్ప ఆలయానికి కిలోమీటర్ దూరంలో ఈ ప్రమాదం జ‌రిగింది. హనుమకొండ జిల్లా కొత్త బస్టాండ్ ప్రాంతంలోని పాత్ ఫైండర్ టెక్నో స్కూల్ విద్యార్థులు విహారయాత్రకు రామప్పకు శనివారం ఉదయం చేరుకున్నారు.

అనంతరం తిరుగు ప్రయాణంలో రామప్ప ఆర్చిని దాటిన కిలోమీటర్ లోపే సాంకేతిక లోపంతో బస్సు అదుపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లి నిలిచిపోయింది. ఈ ప్రమాదంలో విద్యార్థులకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మరో బస్సులో విద్యార్థులను ఇంటికి క్షేమంగా చేర్చారు. బస్సును జేసీబీ సహాయంతో బయటకు తీశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement