Thursday, April 18, 2024

వ‌చ్చే 25ఏళ్ల‌లో దేశానికి.. దేశంలోని ప్ర‌తి పౌరుడికి అమృత కాలం.. ప్ర‌ధాని మోడీ

వ‌చ్చే 25ఏళ్ల‌లో దేశానికి..దేశంలోని ప్ర‌తి పౌరుడికి అమృత కాల‌మ‌ని అన్నారు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.ఈ సమయంలోనే దేశాన్ని అభివృద్ధి చెందిన భారత్ గా నిర్మించుకోవాలని అన్నారు. కర్ణాటక యాద్గిర్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మోడీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ … అభివృద్ధే తమకు ముఖ్యమని ప్రధాని మోదీ అన్నారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వంలో (కేంద్రం, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం) అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. పరిశ్రమలను విస్తరించడం, మంచి పంటలను పండించడం వంటి కార్యక్రమాల ద్వారానే మన దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పటికి దేశంలో కేవలం 3 కోట్ల ఇళ్లకు మాత్రమే కుళాయి ద్వారా నీళ్లు వచ్చేవని… ఇప్పుడు 11 కోట్ల ఇళ్లకు అందుతున్నాయిని తెలిపారు. కర్ణాటక అసెంబ్లీకి ఈ ఏడాది మే నెల లోపల ఎన్నికలు వస్తాయని చెప్పారు. కర్ణాటకలో 224 అసెబ్లీ స్థానాలు ఉండగా… 150 చోట్ల విజయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు మోడీ. బీజేపికి ఓటు బ్యాంకు రాజకీయాలు ముఖ్యం కాదని… ఇలాంటి రాజకీయాలకు బీజేపీ ప్రాధాన్యతను ఇవ్వదన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement