Wednesday, April 24, 2024

అత్యంత అద్భుతమైన రాజ్యాంగాన్ని అంబేద్కర్‌ అందించారు: గవర్నర్‌ తమిళిసై

రాజ్యాంగం వల్లే భారతదేశం బలంగా ఉందని తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌంద‌ర‌రాజ‌న్‌ అన్నారు. అంబేద్కర్‌ దేశానికి అత్యంత అద్భుతమైన రాజ్యాంగాన్ని అందించారని చెప్పారు. హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో జరిగిన 72వ రాజ్యాంగ దినోత్సవంలో గవర్నర్‌ తమిళిసై, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మ, మంత్రులు కేటీఆర్‌, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ప్రశాంత్‌ రెడ్డి, సత్యవతి రాథోడ్‌ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గవర్నర్‌ తమిళిసై మాట్లాడుతూ.. రాజ్యాంగం కోసం రాజ్యాంగ రచన కమిటీ ఎంతో కృషి చేసిందన్నారు. ఏడు దశాబ్దాలుగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొని దృఢంగా నిలిచిందని పేర్కొన్నారు. కరోనా మహమ్మారిపై మాట్లాడుతూ.. ‘‘ఇంకా కరోనా పోలేదని, ప్రతిఒక్కరూ భౌతికదూరం పాటిస్తూ మాస్కులు ధరించాలి’’ అని గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సూచించారు. అందరూ తప్పనిసరిగా కరోనా టీకా వేయించుకోవాలని, రెండు డోసులు తీసుకోవాలని కోరారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసంఫేస్‌బుక్‌,  ట్విట్టర్   పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement