Wednesday, March 27, 2024

Breaking | దొంగ‌ల ముసుగులు తొలిగిపోయాయి.. జేబు సంస్థ‌కు కేసు వ‌చ్చింద‌ని బీజేపీ సంబురాలు

ఎమ్మెల్యేల ఎర కేసులో బీజేపీ పాత్ర లేద‌న్న కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డిపై మంత్రి కేటీఆర్ మండిప‌డ్డారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో చిక్కిన దొంగ‌ల‌కు నార్కో అనాలిసిస్‌, లై డిటెక్ట‌ర్ ప‌రీక్ష‌ల‌కు సిద్ధ‌మా అని కిష‌న్‌రెడ్డికి స‌వాల్ విసిరారు కేటీఆర్‌. ఈ కేసుకు త‌మ‌కు సంబంధం లేదంటున్న బీజేపీ.. ఇప్పుడు కుట్ర కేసు జేబు సంస్థ సీబీఐకి చిక్కినందుకు సంబర‌ప‌డుతోంద‌ని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో దొంగల ముసుగులు తొలిగాయని, స్కాంలో స్వామీజీలతో సంబంధం లేదన్నవారు సంబరాలు చేసుకుంటున్నారని, దొంగలను భుజాలపై మోస్తున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement