Tuesday, April 16, 2024

Breaking: ఫోన్ కొనివ్వలేదని.. బాలిక ఆత్మహత్య..

నిజామాబాద్ అర్బన్ … ఫోన్ కొనివ్వలేదని ఓ బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. నగరంలోని 3వ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుభాష్ నగర్ లో శివాని అనే బాలిక ఈరోజు తెల్లారుజామున ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తనకు సెల్ ఫోన్ కొనివ్వాలని తల్లిదండ్రులను కోరగా.. వారు కొనివ్వలేకపోవడంతో బాలిక సూసైడ్ కు పాల్పడింది. టెన్త్ క్లాస్ చదివిన శివాని ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కు ఊరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. 3వ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement