Tuesday, March 26, 2024

హైదరాబాద్ కు స్పుత్నిక్ వి టీకాలు వచ్చేశాయ్!

భార‌త్‌ను వ్యాక్సినేష‌న్ కొర‌త వెంటాడుతున్న వేళ… ర‌ష్యాకు చెందిన స్పుత్నిక్ వి వ్యాక్సిన్ తొలి క‌న్‌సైన్‌ మెంట్  హైద‌రాబాద్‌ కు చేరుకుంది. భారత్ తో ఒప్పందంలో భాగంగా మాస్కో నుంచి ల‌క్షా 50 వేల డోసుల స్పుత్నిక్ వి వ్యాక్సిన్ల‌తో ఉన్న విమానం నేరుగా హైద‌రాబాద్ లోని ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయ్యింది. ఈ వ్యాక్సిన్ల‌ను వీటిని డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ కు అప్పగించనున్నారు. దేశంలో ఈ వ్యాక్సిన్ త‌యారీకి ర‌ష్య‌న్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (ఆర్డీఐఎఫ్‌)తో చేతులు క‌లిపింది రెడ్డీస్ లేబొరేట‌రీస్‌. గ‌త నెల 13న స్పుత్నిక్ వి వ్యాక్సిన్‌ కు డీసీజీఐ అనుమ‌తి ఇచ్చిన విష‌యం తెలిసిందే. మరికొద్ది రోజుల్లోనే మ‌రో 30 ల‌క్ష‌ల డోసుల వ్యాక్సిన్ కూడా భారత్ కు రానుంది. అనంతరం, జూన్ లో 50 లక్షల డోసులు, జూలైలో కోటికి పైగా డోసులు భారత్ రానున్నాయి. స్తుతం భారత్ లో కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాలు పంపిణీ చేస్తున్నారు. వీటితోపాటు ఇకపై స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ ను కూడా అందించనున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement